అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 రవాణా విమానం ప్రమాదానికి గురైంది. సైనిక స్థావరంలో ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం కుప్పకూలి మంటలు చెలరేగాయి. వైమానిక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.