టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్పై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో డకెట్ ఔటైన సమయంలో సిరాజ్ అభ్యంతరకరంగా మాట్లాడినందుకు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధిస్తున్నట్లు ఐసీసీ వెల్లడించింది. కాగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 192 పరుగులు చేసి ఆలౌటైంది. లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా ఓవర్నైట్ 4 వికెట్లు కోల్పోయి 58 పరుగులతో కొనసాగుతుంది.