దేశంలో తాను ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంటే 40 కోట్ల ఎకరాల వ్యవసాాయానికి నదుల నీళ్లు ఎలా వాడాలో ప్రతిపాదనలు తీసుకొస్తానని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 'IGNITION' సదస్సులో మాట్లాడుతూ.. 'ప్రతీ ఇంటికి మంచినీటి సౌకర్యం కల్పిస్తానని ప్రజలకు మాటిస్తాను. పబ్లిక్ హెల్త్, ట్రాన్స్పోర్టేషన్, ఎడ్యుకేషన్ లాంటి అంశాల గురించి ప్రజలకు భరోసా కల్పిస్తాను. అర్బన్, రూరల్, అగ్రికల్చర్, ఎకనామికల్, ఎనర్జీ ఎజెండాలను ప్రజల ముందు స్పష్టంగా ప్రదర్శిస్తాను' అని అన్నారు.