మారుతున్న జీవనశైలిలో ఆహారపు అలవాట్లే క్యాన్సర్కు ప్రధాన కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన మాంసం, శీతల పానీయాలు, ఆల్కహాల్, డీప్ ఫ్రై వంటి పదార్థాలు క్యాన్సర్కు దారితీస్తున్నాయని తెలిపారు. ప్యాక్ చేసిన చిరుతిళ్లలోని రసాయనాలు శరీరంలో మంటను కలిగిస్తాయని, వీటికి బదులుగా తాజా పండ్లు, కూరగాయలు వంటి ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పును సమర్థవంతంగా అరికట్టవచ్చని సూచించారు.