భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లాండ్ 304 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్.. 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయి భారత్ ముందు 305 టార్గెట్ ఉంచింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో డకెట్ (65), జోరూట్ (69) లివింగ్ స్టోన్ (41) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో జడేజా 3 వికెట్లు తీయగా హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, పాండ్యా, షమీ చెరో వికెట్ తీశారు.