IND vs NZ వన్డేలో న్యూజిలాండ్కు మరో దెబ్బ తగిలింది. 37.3వ ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో మిచెల్ హే (18) క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. బ్యాట్ను ఝళిపించేందుకు ప్రయత్నించిన హే ఔట్ అయ్యాడు. దీంతో 198 పరుగుల వద్ద కివీస్ ఐదో వికెట్ కోల్పోయింది. అనంతరం కెప్టెన్ బ్రాస్వెల్ బ్యాటింగ్కు దిగాడు. ఈ ఓవర్లో ప్రసిద్ధ్ నాలుగు పరుగులే ఇచ్చాడు. ప్రస్తుతం 38 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోరు 200/5గా ఉంది.