ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మరికాసేపట్లో భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచులో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఎలాగైనా సరే న్యూజిలాండ్ను ఓడించి 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.