కోల్కతా వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు 189 పరుగుల వద్ద ముగించింది. దీంతో దక్షిణాఫ్రికాపై భారత్కు 30 పరుగుల ఆధిక్యం లభించింది. కేఎల్ రాహుల్ 39 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, సుందర్ 29, పంత్ 27, జడేజా 27 రన్స్ చేశారు. గిల్ 4 పరుగుల వద్ద గాయంతో రిటైర్డ్ హర్ట్గా బయటకు వెళ్లాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హార్మర్ 4, మార్కో జాన్సన్ 3 వికెట్లు తీసి భారత్ను కట్టడి చేశారు. కాగా ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 159 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.