కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో భారత్–దక్షిణాఫ్రికా తొలి టెస్ట్ రెండో రోజు జరుగుతోంది. లంచ్ బ్రేక్ టైంకి టీమ్ఇండియా 138/4 స్కోర్ చేసింది. ఓవర్నైట్ 37/1తో ప్రారంభించిన భారత్లో రాహుల్ (39), సుందర్ (29), పంత్ (27) ఔటయ్యారు. జడేజా (11*), జురేల్ (5*) క్రీజులో ఉన్నారు. గిల్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. సఫారీ బౌలర్లలో జాన్సెన్, మహరాజ్, హార్మర్, బోష్ తలో వికెట్ తీశారు.