నేడు వైజాగ్‌లో భారత్, దక్షిణాఫ్రికా చివరి వన్డే

భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి రెండు వన్డేలు హోరాహోరీగా సాగి, ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. డిసెంబర్ 6న వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగే మూడో, చివరి వన్డేలో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా, స్వదేశంలో సిరీస్‌ను కాపాడుకోవాల్సిన ఒత్తిడి భారత్‌పై ఉంది. ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత పోస్ట్