ఇంగ్లాండ్ను భారత మహిళల జట్టు చిత్తు చేసింది. ఇంగ్లాండ్పై 3-1 తేడాతో తొలి టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. నాలుగో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత జట్టు 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. స్మృతి మంధాన(32), షఫాలీ వర్మ(31), రోడ్రిగ్స్(24), హర్మన్ప్రీత్ కౌర్ (26) రాణించారు.