ఇంగ్లాండ్ మధ్య జరగబోయే రెండో టీ20 మ్యాచ్ నేపథ్యంలో భారత జట్లులో భారీ మార్పులు చేయనున్నట్లు సమాచారం. శనివారం మాంచెస్టర్ వేదికగా జరిగే రెండో పోరులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జట్టులో చోటు కల్పించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలూ ఉన్నాయి. అలాగే మాంచెస్టర్ పిచ్ పరిస్థితులను బట్టి లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ బ్యాకప్తో పాటు పరుగులను నియంత్రించగల స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను బరిలోకి దించాలని భావిస్తున్నట్లు సమాచారం.