లష్కరే తోయిబా (LeT) టాప్ లీడర్, పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరి, తనను చూసి భారత్ వణుకుతోందని తెలిపాడు. కశ్మీర్ మిషన్ నుంచి వెనక్కి తగ్గేది లేదని, పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో విద్యార్థులను ఉద్దేశించి ప్రగల్భాలు పలికాడు. పాక్ ఆర్మీనే తనను ఆహ్వానిస్తుందని చెప్పడం ద్వారా, అంతర్జాతీయ సమాజం ముందు ఉగ్రవాదంపై పోరాడుతున్నామని చెప్పుకునే పాకిస్థాన్ ముసుగును తొలగించినట్లయింది.