ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ 79 పరుగులకు ఔట్ అయ్యారు. 36వ ఓవర్లో న్యూజిలాండ్ బౌలర్ ఓరూర్క్ వేసిన రెండో బంతికి క్యాచ్ ఇచ్చి శ్రేయాస్ పెవిలియన్ చేరారు. దీంతో 36.2 ఓవర్లకి టీమిండియా స్కోర్ 172/5 గా ఉంది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ (17), హార్దిక్ పాండ్య క్రీజులో ఉన్నారు.