మూడో వికెట్ కోల్పోయిన భారత్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. టీమిండియా కెప్టెన్ ‌రోహిత్ శర్మ (76) ఔట్ అయ్యారు. రచిన్ రవీంద్ర వేసిన 26 వ ఓవర్ మొదటి బంతికి రోహిత్ స్టంపౌట్ అయ్యి పెవిలియన్ చేరారు. దీంతో 26.1 ఓవర్లకు టీమిండియా స్కోర్ 122/3 గా ఉంది. భారత్ వరుస వికెట్లు కోల్పోవడంతోమ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. కివీస్‌ జట్టులో గెలుపు ఆశలు చిగురించాయి.

సంబంధిత పోస్ట్