భారత్–ఆస్ట్రేలియా ఐదు టీ20ల సిరీస్లో 2-1 తేడాతో ముందంజలో ఉన్న టీమిండియా సిరీస్ విజయం కోసం నేడు గబ్బాలో ఆఖరి పోరుకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శనివారం ఐదో మ్యాచ్ ప్రారంభమైంది. భారత ఇన్నింగ్స్ను అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ ప్రారంభించారు. ఆసీస్ తరఫున తొలి ఓవర్ బౌలింగ్ను బెన్ డ్వార్షుయిస్ ప్రారంభించాడు. సిరీస్ దక్కించుకునే దిశగా సూర్యకుమార్ సేన బరిలోకి దిగింది.