వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025 టోర్నీ నేడు ప్రారంభం కానుంది. బర్మింగ్హామ్ మైదానంలో శుక్రవారం రాత్రి 9 గంటలకు మొదటి మ్యాచ్లో ఇంగ్లండ్ ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ తలపడనున్నాయి. అలాగే, జూలై 20న ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ మ్యాచ్ జరగనుంది. ఇండియా ఛాంపియన్స్ కెప్టెన్గా యువరాజ్ సింగ్ వ్యవహరిస్తున్నాడు. 6 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ ఆగస్టు 2 వరకు కొనసాగుతుంది.