భారత్పై దాడి చేసేందుకు పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత ఆర్మీ అమృత్సర్లో కూల్చివేసింది. దీనికి సంబంధించిన వీడియోను భారత ఆర్మీ షేర్ చేసింది. ఆపరేషన్ సిందూర్లో భాగంగా శనివారం తెల్లవారుజామున అమృత్సర్లోని ఖాసా కంటోన్మెంట్ గగనతలంలో శత్రు డ్రోన్లను భద్రతా బలగాలు గుర్తించాయి. వెంటనే భద్రతా బలగాలు దాన్ని కూల్చివేసినట్లు ఆర్మీ వెల్లడించింది.