అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుజరాత్కు చెందిన మేఘ్నా పటేల్ అనే భారతీయ మహిళ ఓ స్టోర్లో దుండగుడి కాల్పుల్లో మరణించారు. దుండగుడు కస్టమర్ తరహాలో దుకాణంలోకి ప్రవేశించి, మేఘ్నాతో మాట్లాడిన కొద్దిసేపటికే ఆమెపై కాల్పులు జరిపి, అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన దోపిడీ కోసమే జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్లో దుండగుడి దృశ్యాలు బయటపడ్డాయి.