ఇండిగో వ్యవహారంతో ప్రయాణికులు మానసిక క్షోభకు గురయ్యారని పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ అన్నారు. వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఈ పరిస్థితులకు బాధ్యులు ఎవరో గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ వ్యవహారంపై డీజీసీఏ ఇప్పటికే విచారణ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. అలాగే కంట్రోల్ రూమ్ను కూడా అందుబాటులో తీసుకొచ్చిందన్నారు.