ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఇండిగో సీఈఓ క్షమాపణలు తెలిపారు. ఎయిర్ లైన్స్ సిబ్బంది, పైలట్ల కొరత కారణంగానే విమానాలు రద్దు చేయాల్సి వచ్చిందని, సమస్యను పరిష్కరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ఆయన వీడియో సందేశంలో పేర్కొన్నారు. డీజీసీఏ సడలింపులు తమకు ఊరటనిచ్చాయని, త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.