దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై అమెరికా సీఐఏ మాజీ అధికారి రిచర్డ్ బార్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్లోని కహుతా అణుకేంద్రంపై కోవర్ట్ ఆపరేషన్ చేపట్టాలని నాటి అమెరికా ప్రతిపాదించిందని వెల్లడించారు. ఆ యోజనకు ఇజ్రాయెల్ అంగీకరించినప్పటికీ, భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మాత్రం అంగీకారం తెలపలేదని తెలిపారు. ఆ దాడి జరిగి ఉంటే పాకిస్థాన్ అణు ఆయుధ ప్రోగ్రామ్ నిలిచిపోయేదని, ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించేదని బార్లో వ్యాఖ్యానించారు.