ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఒక ట్రెండ్గా మారింది. విష్ణుప్రియ, అనన్య నాగళ్ల, అషు రెడ్డి, డింపుల్ హయతి వంటి పలువురు నటీమణులు ఈ బాట పట్టారు. తాజాగా, 'చిరుత' సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన నేహా శర్మ కూడా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ప్రారంభించింది. నెలకు రూ. 290 చెల్లిస్తే ప్రత్యేక కంటెంట్ అందిస్తానని ఆమె ప్రకటించింది. గతంలో ఈ సబ్స్క్రిప్షన్ విధానంపై విష్ణుప్రియపై పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే.