జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం విషాద ఘటన నెలకొంది. వరుసకు సోదరుడైన మనోజ్ కుమార్ ప్రేమ పేరుతో వేధించగా, చివరికి అతని ప్రేమను అంగీకరించినా పెళ్లికి నిరాకరించడంతో విద్యార్థిని డిసెంబర్ 8న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ప్రేమ పేరుతో లోబర్చుకుని, పెళ్లికి నిరాకరించి, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని విద్యార్థిని సూసైడ్ నోట్లో పేర్కొంది. దీంతో మనోజ్ను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.