AP: ప్రేమిస్తున్నప్పుడు అడ్డురాని కులం పెళ్లి చేసుకోవడానికి అడ్డు అయింది. ప్రియుడు ముఖం చాటేయడంతో మనస్తాపానికి గురైన ఎంటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒంగోలు నగరంలోని కబాడిపాలెంకు చెందిన నళిని, మహేంద్రనగర్కు చెందిన శ్రీనివాస్ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించాడు. నళినిని అన్ని విధాలుగా వాడుకుని.. చివరికి వదిలేశాడు. దాంతో యువతి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.