BCCI భారత ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది. వెస్టిండీస్, అమెరికాలో జరిగే టీ20 ప్రపంచకప్తో ప్రస్తుత చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త కోచ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 27 చివరి తేదీగా ప్రకటించింది. దరఖాస్తులను క్షుణ్ణంగా చెక్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది జాబితాను వెల్లడిస్తామని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.