2026 ఐపీఎల్ లీగ్ ఆక్షన్ కోసం బీసీసీఐ చర్యలు చేపట్టింది. ఇప్పటికే నమోదు చేసుకున్న ఆటగాళ్ల జాబితా నుంచి 1,005 పేర్లను తొలగించింది. అదే సమయంలో, 35 మంది కొత్త ఆటగాళ్ల పేర్లను చేర్చింది. దీంతో మొత్తం 350 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నారు. ఈ వేలం డిసెంబర్ 16న అబుదాబీలో జరగనుంది. ఈ మేరకు ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు బీసీసీఐ సమాచారం అందించింది.