18 ఏళ్ల చరిత్రలో ఐపీఎల్ టోర్నీ వాయిదా పడడం ఇది రెండోసారి. గతంలోనూ 2021లో కోవిడ్ కారణంగా ఐపీఎల్ సీజన్ వాయిదా పడింది. తర్వాత పరిస్థితులు చక్కదిద్దుకున్నాక పునఃప్రారంభమైంది. అదే తరహాలో ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. భారత్-పాక్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సీజన్ను వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. మ్యాచ్ల నిర్వహణ, ప్రేక్షకుల భద్రత సవాళ్లుగా మారడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.