IPL-2025లో భాగంగా మరికాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఆడిన 6 మ్యాచుల్లో రెండు మాత్రమే గెలిచి ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న రాజస్థాన్ ఈ మ్యాచులో ఎలా ఆడుతుందో చూడాలి.