సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్పై ఇరాన్ మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో 10 మంది అమెరికా సైనికులు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అలాగే అమెరికాకు చెందిన పలు రీఫ్యూయలింగ్ విమానాలు, ఒక నిఘా విమానం దెబ్బతిన్నాయి. కాగా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 300 మందికి పైగా అమెరికా సైనికులు గాయపడగా.. 13 మంది మరణించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.