ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఎదురుదాడులకు దిగింది. ఈ క్రమంలో బెహ్రెయిన్లోని ప్రముఖ కార్యాలయాలు, భవనాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేసినట్లు సమాచారం. సీనియర్ అమెరికన్ మిలిటరీ కమాండ్ సిబ్బంది నివసిస్తున్నట్లు భావిస్తున్న భవనాలపై ఈ దాడులు జరిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు బహ్రెయిన్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇదిలా ఉండగా, బెహ్రెయిన్లో పెద్దఎత్తున ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేపట్టడంతో కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగినట్లు తెలుస్తోంది.