గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఇరాన్ ఓ చమురు నౌకను సీజ్ చేసింది. ఈ నౌకలో భారతీయులతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్లకు చెందిన మొత్తం 18 మంది సిబ్బంది ఉన్నారని స్థానిక మీడియా వెల్లడించింది. 60 లక్షల లీటర్ల డీజిల్ను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలతో ఇరాన్ ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.