భారత షూటర్ ఇషా సింగ్ చైనాలోని నింగ్బోలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్కప్లో 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించింది. నింగ్బో ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్లో జరిగిన ఫైనల్లో హోమ్ ఫేవరెట్ యావో క్వియాన్జున్ను మట్టికరిపించిన ఇషా 242.6 పాయింట్లు సాధించింది. దక్షిణ కొరియాకు చెందిన ఓహ్ యెజిన్ బ్రాంజ్ గెలుచుకోగా, గోల్డ్ మెడల్ సాధించడం ఆనందంగా ఉందని ఇషా సింగ్ తెలిపింది.