మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. గత శనివారం ప్రారంభమైన ఈ ఘర్షణ క్రమంగా తీవ్రస్థాయికి చేరుకుంది. టెల్ అవీవ్పై ఇరాన్ క్షిపణులతో దాడి చేయగా, దీనికి ప్రతీకారంగా టెహ్రాన్, బీరూట్లపై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. ఖమేనీ కోసం నిర్మించిన బంకర్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేయగా, తాజాగా ఇరాన్ ఎయిర్పోర్టును కూడా పేల్చేసింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.