గాజాలో సామాన్య పౌరులపై ఇజ్రాయెల్ దాడులు పాశవికంగా కొనసాగుతున్నాయి. తాగునీటి కోసం ఓ ప్రాంతంలో గుమిగూడిన ప్రజలపై ఆదివారం జరిపిన దాడిలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. తాజా మరణాలతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 58వేలు దాటిందని అక్కడి ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా ఇప్పటికే ఇరువర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే.