TG: కాంగ్రెస్ పార్టీ వీడిన సీనియర్ నేత జీవన్ రెడ్డి సీఎం రేవంత్పై విమర్శలు చేయడం సరికాదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం గాంధీభవన్లో మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు అంతా ఎన్నుకున్న వ్యక్తి సీఎం రేవంత్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదని, భవిష్యత్తులో 2 పార్టీలు కలిసి పోతాయని జోస్యం చెప్పారు. పొంగులేటిపై చేస్తున్న విమర్శలకు ఆధారాలు ఉంటే చర్చకు సిద్ధమన్నారు. హరీశ్రావు వద్ద ఆధారాలు ఉంటే తీసుకురావాలన్నారు.