వికారాబాద్లో ఆదివారం బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ర్యాలీలో ఓ అభిమాని ఆసక్తికరంగా వ్యవహరించాడు. ఈ అభిమాని, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఫొటోతో కూడిన ఫ్లెక్సీని పట్టుకుని ర్యాలీలో పాల్గొని తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది.