తెలంగాణ రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కక్ష సాధింపు రాజకీయాలకు తాను వ్యతిరేకమన్నారు. వైఎస్.రాజశేఖర్రెడ్డి, రోశయ్య ఎప్పుడూ రివైంజ్ పాలిటిక్స్ చేయలేదని తెలిపారు. 'ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా డబ్బులు తీసుకోకుండా రాజకీయం చేస్తున్నట్లుగా ఒప్పుకుంటారా? తనతో సహా పైసలు ముట్టుకోకుండా రాజకీయం చేయని నాయకుడెవరూ ఉండరు' అని పేర్కొన్నారు.