జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్, తన కుటుంబంతో కలిసి శుక్రవారం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులచే ఘన స్వాగతం అందుకున్న ఆయన, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ స్థానాచారి వేదాశీర్వచనం అందించగా, ఆలయ ఈఓ శేష వస్త్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.