జగిత్యాల పట్టణంలోని మార్కండేయ నగర్ కు చెందిన దగ్గు లక్ష్మీకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 60,000 రూపాయల విలువైన చెక్కును శుక్రవారం జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తన క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సహాయం లక్ష్మీకి ఆర్థికంగా అండగా నిలుస్తుంది.