జగిత్యాల జిల్లా గొల్లపల్లి మం. రంగదామునిపల్లిలోని గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందున్న ట్రాన్స్ఫార్మర్ పాడై కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నవి. దీనితో వరి నారు ఎండిపోకుండా రైతులు, మహిళలు బిందెలతో నీళ్లు పోస్తున్నారు. 10 రోజులైనా ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.