జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమలో విపత్తు సంభవిస్తే తెలంగాణకు ఏం సంబంధం అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని మంత్రి అన్నారు.