తమ సమస్యల పరిష్కారం కోసం శనివారం చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో, హైదరాబాద్కు బయలుదేరుతున్న ఆశావర్కర్లను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారిని రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ అరెస్టులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.