ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో సోమవారం మధ్యాహ్నం, ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు రచిత్ మధ్యన్ తన జాగ్వార్ కారును అతి వేగంతో నడుపుతూ బీభత్సం సృష్టించాడు. రాజ్రూపర్ ఏరియాలో డివైడర్ను ఢీకొని, రోడ్డు పక్కన ఉన్న మనుషులు, తోపుడు బళ్లు, వాహనాలను ఢీకొట్టుకుంటూ ముందుకు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 55 ఏళ్ల ప్రదీప్ అనే వ్యక్తి మృతి చెందగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన రచిత్ను పోలీసులు అదుపులోకి తీసుకుని, మంగళవారం కోర్టులో హాజరుపరచగా, అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించారు.