జమ్మూకశ్మీర్లోని పేలుడు ఘటనపై అధికారులు కీలక వివరాలు వెల్లడించారు. చనిపోయిన వారు పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బందే అని తెలిపారు. ఫరీదాబాద్ ఉగ్ర కుట్ర కేసులో స్వాధీనం చేసిన పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ సేకరిస్తుండగా అకస్మాత్తుగా భారీ విస్ఫోటనం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి, దట్టమైన పొగ చుట్టుముట్టింది. పేలుడు తీవ్రతకు 800 మీటర్ల దూరం వరకు శరీర భాగాలు చెల్లాచెదురయ్యాయని చెప్పారు. పోలీస్ స్టేషన్ భవనం పూర్తిగా ధ్వంసమైంది.