జానీ మాస్ట‌ర్‌కు షాక్ ఇచ్చిన జ‌న‌సేన‌

అత్యాచార ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న జానీ మాస్ట‌ర్‌కు మ‌రో షాక్ త‌గిలింది. జానీ మాస్టర్‌ను జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తూ పత్రిక ప్రకటన విడుదల చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు కావ‌డంతో జ‌న‌సేన ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు పార్టీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ హెడ్ వేముల‌పాటి అజ‌య్‌కుమార్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ నిర్ణ‌యం త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ఆయ‌న తెలిపారు.

సంబంధిత పోస్ట్