దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ అక్టోబర్ 15న విడుదలయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్ విడుదలైన రోజు నుంచే ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈసారి కూడా పరీక్షలు రెండు విడతల్లో నిర్వహించనున్నారు. జనవరి నాలుగో వారంలో మొదటి సెషన్, ఏప్రిల్లో రెండో సెషన్ పరీక్షలు జరిగే అవకాశం ఉంది.