పదో తరగతి పాసైన విద్యార్థులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. తాజాగా సెంట్రల్ రైల్వే ‘రిక్రూట్మెంట్ సెల్’ మొత్తం 2,424 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. వివిధ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ rrccr.comలో ఆగస్టు 15 లోపు దరఖాస్తు సమర్పించాలి. అభ్యర్థులు మ్యాథ్స్, ఐటీఐలో సాధించిన మార్కుల సగటు ఆధారంగా మెరిట్ లిస్టును తయారు చేస్తారు.