ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ అభిమానులు నగర సీపీ సజ్జనార్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడు నందిపాటి మురళి నేతృత్వంలో సీపీని కలిసి, ఈ దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.