ఆంధ్రప్రదేశ్కు చెందిన భారత స్టార్ ఆర్చర్ వెన్నెం జ్యోతి సురేఖ బంగ్లాదేశ్లో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో కాంపౌండ్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో గోల్డ్ మెడల్స్ గెలుచుకుని మరోసారి ఆసియా చాంపియన్గా నిలిచింది. గురువారం జరిగిన వ్యక్తిగత ఫైనల్లో ఆమె 147-145తో మరో భారత ఆర్చర్ ప్రతీక ప్రదీప్ను ఓడించింది. టీమ్ ఈవెంట్లో జ్యోతి, ప్రతీక, దీప్షిక త్రయం కొరియాను 236-234 తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. ఇది జ్యోతికి వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లు కలిపి 7వ ఆసియా చాంపియన్షిప్ గోల్డ్ మెడల్.